Tuesday, October 11, 2011

గజల్ మూగబోయింది!


నిన్న మధ్యాహ్నం ఆఫీసులో ఒక వార్త విన్నాను... ఒక ఉద్యోగి హఠాత్తుగా బ్రెయిన్ హేమరేజ్ తో చనిపోయారని. చాలా బాధ కలిగింది. ఆయన చాలా మంచి వ్యక్తి. చిన్న వయసులోనే ఆయనలా మరణించడం నన్ను కలవరపెట్టింది. ఆ మూడ్ లోనే ఇంటికి చేరాను. కాస్త మూడ్ మారుతుందని టీవీ పెట్టాను. మళ్ళీ ఇంకో విషాద వార్త. నా అభిమాన గాయకుడు, గజల్ కు ప్రాణం పోసిన మహానుభావుడు జగ్జీత్ సింగ్ చనిపోయారు. ఒక్క క్షణం మనసు రెపరెపలాడింది. ఎప్పుడు మనసు కాస్త బాగోకపోయినా ఆయన పాటలు వింటూ నన్ను, నా సమస్యలనూ మర్చిపోవటం నాకు అలవాటు. కాని ఇప్పుడు ఆయన పోయారన్న బాధను ఏమి చేసి పోగొట్టుకొవాలో అర్ధం కాలేదు. తుం ఇత్నాజొ ముస్కురా రహే హో అంటూ మంద్రంగా సాగిపోయె ఆ గానం ఇక వినిపించదు, బడీ నాజుక్ హై యె మంజిల్ అంటూ మధురంగా పాడిన ఆ స్వరం ఇక పలకదు.   
          తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో , బడీ నాజుక్ హై యె మంజిల్ ,  కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే, కాగజ్ కీ కష్టీ, కభీ ఆసూ కభీ కుషీ, తూ నహీ తో జిందగీ మే... చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి పాటా గుండెను తడుతుంది. ఆర్తిగా తడుముతుంది.
                 ఆహ్లాదకరమైన సంగీతంతో నాలాంటి ఎందరి మనసులకో శాంతి కలిగించిన ఆ మహా గాయకుడి ఆత్మకు శాంతి చేకూర్చమని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

1 comment:

  1. అవును.నాకు ఆ రెండు వార్తలు చదివితె అల్లాగె బాధగా అనిపించింది

    ReplyDelete